West Indiesపై ఆస్ట్రేలియా ప్రతీకారం.. వన్డే సిరీస్ కైవసం
ABN , First Publish Date - 2021-07-27T22:54:32+05:30 IST
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన చివరి వన్డేలో విజయం
కెన్సింగ్టన్ ఓవల్: మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన చివరి వన్డేలో విజయం సాధించిన ఆస్ట్రేలియా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుని టీ20 సిరీస్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. నిన్న జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో ఆసీస్ ఘన విజయం సాధించింది. విండీస్ను తొలుత 45.1 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూల్చిన ఆసీస్.. 30.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్లో 11 వికెట్లు పడగొట్టిన మిచెట్ స్టార్క్కు మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది. కాగా, అంతకుముందు జరిగిన టీ20 సిరీస్లో ఆస్ట్రేలియాను విండీస్ చిత్తు చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను విండీస్ 4-1తో సొంతం చేసుకుంది.