ప్రియాంక, జాన్సన్కు కరోనా
ABN , First Publish Date - 2021-04-14T08:46:53+05:30 IST
టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత యువ అథ్లెట్ ప్రియాంక గోస్వామి (20 కి.మీ రేస్వాక్)తో పాటు 2018 ఆసియా పతక విజేత జిన్సన్ జాన్సన్ (1500 మీటర్లు పరుగు), మహిళా స్టీపుల్ చేజర్ చింటా యాదవ్ కరోనా...
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత యువ అథ్లెట్ ప్రియాంక గోస్వామి (20 కి.మీ రేస్వాక్)తో పాటు 2018 ఆసియా పతక విజేత జిన్సన్ జాన్సన్ (1500 మీటర్లు పరుగు), మహిళా స్టీపుల్ చేజర్ చింటా యాదవ్ కరోనా బారినపడ్డారు. బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణ కేంద్రంలో మంగళవారం మొత్తం ఐదుగురు అథ్లెట్లు పాజిటివ్గా తేలారు. ఫిబ్రవరిలో రాంచీలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షి్పలో మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్లో రికార్డు ప్రదర్శనతో ప్రియాంక (ఉత్తరప్రదేశ్) టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకొంది. కాగా, భారత రేస్ వాకింగ్ జట్టుకు శిక్షణ ఇస్తున్న విదేశీ కోచ్ అలెగ్జాండర్ (రష్యా)కు కూడా కొవిడ్ సోకింది.