‘అర్జున’ పిచ్చయ్యకు అంతిమ నివాళి
ABN , First Publish Date - 2021-12-28T08:01:58+05:30 IST
: బాల్ బ్యాడ్మింటన్ పితామహుడు, అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్యకు క్రీడాప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ..
![‘అర్జున’ పిచ్చయ్యకు అంతిమ నివాళి](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122802240172/12282021023140n90.jpg)
హనుమకొండ స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): బాల్ బ్యాడ్మింటన్ పితామహుడు, అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్యకు క్రీడాప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన పిచ్చయ్య పార్ధివదేహానికి సోమవారం ఇక్కడి పోచమ్మకుంటలోని ముక్తిధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. క్రీడాకారులు, అధికారులు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని ఈ క్రీడా దిగ్గజంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జేఎన్ స్టేడియంలో పిచ్చయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.