ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన కెప్టెన్
ABN , First Publish Date - 2021-03-22T03:07:35+05:30 IST
టీమిండియా కెప్టెన్గా ఒకప్పుడు ఎంఎస్ ధోనీ సాధించిన రికార్డును ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అజ్గర్ ఆఫ్ఘాన్ బ్రేక్ చేశాడు. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు ధోనీ పేరుపై..
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కెప్టెన్గా ఒకప్పుడు ఎంఎస్ ధోనీ సాధించిన రికార్డును ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అజ్గర్ ఆఫ్ఘాన్ బ్రేక్ చేశాడు. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు ధోనీ పేరుపై ఉండేది. కెప్టెన్గా ధోనీ ఇప్పటివరకు 72 మ్యాచ్ల్లో 41 విజయాలు సాధించాడు. కానీ శనివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో విజయంతో అజ్గర్ ఈ రికార్డును అధిగమించాడు. కెప్టెన్ ఏకంగా 42 విజయాలు సాధించి టాప్ ప్లేస్కు చేరాడు. ఈ రికార్డును అజ్గర్ కేవలం 55 మ్యాచ్లలోనే అందుకోవడం విశేషం. ప్రస్తుతం ధోనీ రెండో స్థానానికి పడిపోయాడు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 59 మ్యాచ్లలో 33 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 29 విజయాలతో మూడో స్థానంలో, వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ శామి 27 విజయాలతో ఐదో స్థానంలో ఉన్నారు. కాగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ మొత్తం 45 మ్యాచ్లలో టీమిండియాకు సారథ్యం వహించగా వాటిలో 27 విజయాలు సాధించాడు.