అగ్రరాజ్యంలో మరొకరికి మరణ శిక్ష అమలు
ABN , First Publish Date - 2021-01-16T12:55:07+05:30 IST
అమెరికాలో మరొకరికి మరణ శిక్ష అమలైంది.
1992 నాటి వరుస హత్యల కేసులో అమలు
టెరెహాట్, జనవరి 15: అమెరికాలో మరొకరికి మరణ శిక్ష అమలైంది. నిషేధిత డ్రగ్స్ వ్యాపారి, 1992లో వర్జీనియాలో వరుస హత్యలకు పాల్పడ్డ కోరీ జాన్సన్(52)కు గురువారం ఈ శిక్షను అమలు చేశారు. ఇటీవల కరో నా బారిన పడి కోలుకున్న జాన్సన్కు ఊపిరితిత్తులకు నొప్పి కలిగించడం ద్వారా మరణం సంభవించే ఇంజెక్షన్ ఇచ్చినట్లు అతని లాయర్ తెలిపారు. దేశంలో మరణశిక్ష అమలును పక్కనపెట్టిన 17 ఏళ్ల తరువాత డొనాల్డ్ ట్రంప్ హయాంలో తిరిగి ఇవి అమలుకాగా, ఇది 12వ మరణ దండన కావడం గమనార్హం.