రాజధాని సహా ఆ ప్రాంతాలన్నీ డిజాస్టర్ జోన్లు.. ప్రకటించిన స్పెయిన్!

ABN , First Publish Date - 2021-01-20T10:33:23+05:30 IST

స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్ సహా పలు నగరాలను డిజాస్టర్ జోన్లుగా ప్రకటిస్తున్నట్లు మంగళవారం ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఈ దేశంలో ఫిలోమెనా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది.

రాజధాని సహా ఆ ప్రాంతాలన్నీ డిజాస్టర్ జోన్లు.. ప్రకటించిన స్పెయిన్!

మాడ్రిడ్: స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్ సహా పలు నగరాలను డిజాస్టర్ జోన్లుగా ప్రకటిస్తున్నట్లు మంగళవారం ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఈ దేశంలో ఫిలోమెనా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గత 50 ఏళ్లలో స్పెయిన్‌లో వచ్చిన అతి పెద్ద మంచు తుఫాను ఇదే అని పరిశోధకులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలన్నింటినీ డిజాస్టర్ జోన్లుగా గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆయా ప్రాంతాల్లో అత్యవసరాలతోపాటు మిగతా సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది. రాజధాని మాడ్రిడ్‌లో కురిసిన మంచు గనుక కరగడం మొదలు పెడితే.. నగరంలో వరదలొస్తాయని ఇటీవలే మాడ్రిడ్ స్థానిక ప్రభుత్వ అధికారులు ఇటీవలే వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ ప్రాంతాలను డిజాస్టర్ జోన్లుగా ప్రకటించడం గమనార్హం.

Updated Date - 2021-01-20T10:33:23+05:30 IST