మరోసారి TRS అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌కు శుభాకాంక్షలు: NRI టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్

ABN , First Publish Date - 2021-10-26T19:54:16+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన సీఎం కేసీఆర్‌కు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శుభాకాంక్షలు తెలియజేసింది.

మరోసారి TRS అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌కు శుభాకాంక్షలు: NRI టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్

బహ్రెయిన్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన సీఎం కేసీఆర్‌కు ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. అధినేత కేసీఆర్ 60 ఏళ్ల అనూహ్య పోరాటం, మూడు తరాల ఉద్యమ సాకారం నేడు చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఉద్యమ సారధి దశబ్దాల పోరాటం సాగించి చావుకు ఎదురెళ్లి వీరోచితంగా పోరాడి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చారని గుర్తు చేశారు. గల్లీ నుండి ఢిల్లీ  వరకు ఉద్యమ ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఢిల్లీ పెద్దలను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా మారారని కొనియాడారు. 


టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 ఏళ్లుగా ఉద్యమ ప్రస్థానం నుండి 2014, 2018 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకవచ్చి ప్రజారంజక పాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడలేనన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెం.1 గా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను ఎంత మెచ్చుకున్న తక్కువేనని అన్నారు. టీఆర్ఎస్ 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మలుపులు తిరిగినప్పటికీ నేడు 20 ఏళ్ల పండగ జరుపుకుంటున్నందుకు తాను గర్వపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎన్నారైలకు టీఆర్ఎస్ పార్టీకి సేవచేసే అవకాశం కల్పించిన కేసీఆర్‌కు మనస్ఫూర్తిగా ఎన్నారై  టీఆర్ఎస్ సెల్ తరపున రాధారపు సతీష్ కుమార్ ధన్యవాదములు తెలియజేశారు.

Updated Date - 2021-10-26T19:54:16+05:30 IST