కువైత్‌లో విషాదం.. కేరళకు చెందిన గర్భిణీ మహిళ మృతి

ABN , First Publish Date - 2021-07-26T16:24:27+05:30 IST

కువైత్‌లో విషాదం చోటు చేసుకుంది. కరోనా కాటుకు భారత్‌కు చెందిన గర్భిణీ మహిళ బలైంది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కువైత్‌లో సైతం కొవిడ్ కేసులు

కువైత్‌లో విషాదం.. కేరళకు చెందిన గర్భిణీ మహిళ మృతి

న్యూఢిల్లీ: కువైత్‌లో విషాదం చోటు చేసుకుంది. కరోనా కాటుకు భారత్‌కు చెందిన గర్భిణీ మహిళ బలైంది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కువైత్‌లో సైతం కొవిడ్ కేసులు బారీగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేరళలోని తిరువనంతపురానికి చెందిన సిని సంతోష్ (43) అనే గర్భిణీ మహిళ కొద్ది రోజుల క్రితం కొవిడ్ బారినపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కడుపులో ఉన్న శిశువు ప్రాణాలను సైతం వైద్యులు రక్షించలేకపోయారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


Updated Date - 2021-07-26T16:24:27+05:30 IST