గల్ఫ్లో ‘జన గణ మన’
ABN , First Publish Date - 2021-08-16T13:32:13+05:30 IST
భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని గల్ఫ్ దేశాల్లోని భారతీయులు ఈసారి విభిన్నంగా జరుపుకొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా జాతీయగీతం జనగణమన ఆలపించి, దాన్ని రికార్డు చేసి, ప్రభుత్వ పోర్టల్ రాష్ట్రగాన్.ఇన్లో అప్లోడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి భారతీయుడు..
ఉత్సాహంగా రాష్ట్రగాన్ ఆలాపన
ప్రధాని పిలుపునకు ప్రవాసుల భారీ స్పందన
ట్రెండ్ అవుతోన్న చిన్నారి రాచెల్ స్వరం..
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని గల్ఫ్ దేశాల్లోని భారతీయులు ఈసారి విభిన్నంగా జరుపుకొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా జాతీయగీతం జనగణమన ఆలపించి, దాన్ని రికార్డు చేసి, ప్రభుత్వ పోర్టల్ రాష్ట్రగాన్.ఇన్లో అప్లోడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి భారతీయుడు జాతీయగీతాన్ని ఆలపించి అప్లోడ్ చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు విదేశాల్లోని భారతీయ ఎంబసీలు దీన్ని ఒక యజ్ఞంగా భావించి యువతలో ప్రత్యేకించి విద్యార్థులలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. వేలాది మంది చిన్నారులు జాతీయ గీతాన్ని రికార్డు చేసి మురిసిపోయారు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలానికి చెందిన బాబ్జి స్టిఫెన్ డానియల్, సుభాషిణి దంపతుల తొమ్మిదేళ్ల కుమార్తె మరియా రాచెల్ ఆలపించిన జాతీయ గీతం ప్రవాసీయుల్లో చక్కర్లు కొడుతోంది. దుబాయిలో పుట్టి పెరిగిన రాచెల్ ఇక్కడి ఇండియన్ హై స్కూల్లో నాలుగవ తరగతి చదువుతోంది. ఈసారి అత్యధిక మంది భారతీయులు జాతీయ గీతాన్ని ఆలపించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ప్రప్రథమంగా రికార్డు చేయగా, దాన్ని విదేశాల్లోని అసంఖ్యాకులు అనుసరించారు.