అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-03-24T09:40:50+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం కీల

అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడగించింది. కొవిడ్ 19 నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఏప్రిల్ 30 వరకు పొడగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం కార్గో సర్వీసులకు వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు విమానాలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వందే భారత్ మిషన్ విమానాలను యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. 


Updated Date - 2021-03-24T09:40:50+05:30 IST