శిరీషపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం
ABN , First Publish Date - 2021-07-14T20:30:53+05:30 IST
‘వర్జిన్ గెలాక్టిక్’ యాత్రలో భాగంగా రోదసీయానం చేసిన తెలుగమ్మాయి శిరీష బండ్లపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు.
'గుంటూరు టు జీరో గ్రావిటీ' అంటూ ట్వీట్
న్యూఢిల్లీ, జూలై 13: ‘వర్జిన్ గెలాక్టిక్’ యాత్రలో భాగంగా రోదసీయానం చేసిన తెలుగమ్మాయి శిరీష బండ్లపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మీరు గుంటూరు నుంచి జీరో గ్రావిటీని అధిరోహించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.