భర్తను కోల్పోయిన టీచర్కు స్టూడెంట్ లేఖ.. ట్విట్టర్లో వైరల్
ABN , First Publish Date - 2021-03-06T01:04:11+05:30 IST
భర్తను కోల్పోయిన టీచర్కు ఓ విద్యార్థి రాసిన లేఖ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని ఓ స్కూల్లో పనిచేసే మెలిస్సా మిల్నర్ అనే టీచర్కు ఇది తన స్టూడెంట్ రాసిన లెటర్. ఈ మధ్యనే మెలి
వాషింగ్టన్: భర్తను కోల్పోయిన టీచర్కు ఓ విద్యార్థి రాసిన లేఖ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని ఓ స్కూల్లో పనిచేసే మెలిస్సా మిల్నర్ అనే టీచర్కు ఇది తన స్టూడెంట్ రాసిన లెటర్. ఈ మధ్యనే మెలిస్సా మిల్నర్ తర భర్తను కోల్పోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న టీచర్ను ఓదార్చేందుకు ఆ విద్యార్థి రాసిన రెండు లైన్లు లక్షల మంది దృష్టిలో పడ్డాయి.
‘‘డియర్ మిసెస్ మిల్నర్, మీరు భర్తను కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నా. మిస్టర్ మిల్నర్ మీకు మళ్లీ కనిపించకపోవచ్చు. కానీ మీ ఇద్దరి హృదయాలను కనెక్ట్ చేసే ఓ లైన్ ఉంటుందనే విషయాన్ని మీరు ఏనాటికి విస్మరించవద్దు. మీరు ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలి’’ అంటూ ఆ విద్యార్థి రాసిన లేఖ అందరినీ ఆకట్టుకుంది. ఈ లెటర్ను ఆ టీచర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్గా మారింది.