అవగాహన కల్పించండిలా..!
ABN , First Publish Date - 2021-09-06T05:30:00+05:30 IST
పిల్లల చేతుల్లో స్మార్ట్ఫోన్ ఇప్పుడు మామూలు విషయమైపోయింది. అయితే సైబర్ నేరాలు పెరిగిపోతున్న ఈ సమయంలో పిల్లలకు సోషల్మీడియా, నెట్ వాడకంపై అవగాహన కల్పించాలి. ఏం చేయాలంటే...
పిల్లల చేతుల్లో స్మార్ట్ఫోన్ ఇప్పుడు మామూలు విషయమైపోయింది. అయితే సైబర్ నేరాలు పెరిగిపోతున్న ఈ సమయంలో పిల్లలకు సోషల్మీడియా, నెట్ వాడకంపై అవగాహన కల్పించాలి. ఏం చేయాలంటే...
- సైబర్ భద్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిల్లలకు వివరించాలి. టెక్నాలజీని ఎంత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలో నేర్పాలి.
- పిల్లలు కొన్ని యాప్స్, వెబ్సైట్స్లో వ్యక్తిగత వివరాలు పొందుపరుస్తుంటారు. దీనివల్ల ఎదురయ్యే ప్రమాదాలను వాళ్లకు వివరించాలి. కుటుంబసమాచారం, బ్యాంకు వివరాలు, పుట్టిన తేదీల వివరాలు, పూర్తి పేర్లు, వ్యక్తిగత ఫోన్నెంబర్లు, డెబిట్కార్డుల వివరాలు ఎక్కడా పొందుపరచకూడదని చెప్పాలి.
- పిల్లల ఆన్లైన్ యాక్టివిటీపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నట్లయితే వాళ్ల అకౌంట్స్ను ఫాలో కావాలి. పిల్లలు తరచుగా చూస్తున్న వెబ్సైట్లను పరిశీలించాలి. వారి సోషల్ మీడియా అకౌంట్స్ పాస్వర్డ్స్ను అడిగి తెలుసుకోవాలి.
- ఆన్లైన్లో ఎలాంటి కంటెంట్ను షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి కంటెంట్ షేర్ చేయకూడదో చెప్పాలి. వాళ్లు షేర్ చేస్తున్న కంటెంట్ వివరాలు అడిగి తెలుసుకోవాలి.
- సైబర్ నేరాలు, సైబర్ లా గురించి తెలియజేయాలి. ఈ సమయంలో పిల్లలు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇవ్వాలి.