ప్రియాంకే నాయిక
ABN , First Publish Date - 2021-01-31T05:42:12+05:30 IST
తమిళ కథానాయకుడు సూర్య నటించబోయే 40వ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ ఆయనకు జోడీగా కనిపించబోతున్నారు. కథానాయికగా
తమిళ కథానాయకుడు సూర్య నటించబోయే 40వ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ ఆయనకు జోడీగా కనిపించబోతున్నారు. కథానాయికగా ప్రియాంక ఎంపికను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘డాక్టర్’, తెలుగులో శర్వానంద్తో ‘శ్రీకారం చిత్రాల్లో హీరోయిన్గా నటి స్తున్నారు. సూర్య 40వ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి ఆఖరు నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.