అందానికి ముల్తానీ..!
ABN , First Publish Date - 2021-03-06T05:52:53+05:30 IST
ఎండలో బాగా తిరిగివచ్చాక ముఖం కమిలిపోయినట్టుగా, నల్లగా అవుతుంది. అలాంటప్పుడు ముల్తానీ మట్టిలో రోజ్వాటర్ పోసి ఫేస్ మాస్కులా వేసుకుంటే ఫలితం ఉంటుంది
- ఎండలో బాగా తిరిగివచ్చాక ముఖం కమిలిపోయినట్టుగా, నల్లగా అవుతుంది. అలాంటప్పుడు ముల్తానీ మట్టిలో రోజ్వాటర్ పోసి ఫేస్ మాస్కులా వేసుకుంటే ఫలితం ఉంటుంది.
- ముల్తానీ మట్టిలో చెంచా చొప్పున తులసిపొడి, గంధంపొడి వేసి, తగినన్ని పచ్చిపాలు పోసి పేస్టులా చేయాలి. ఈ పేస్టును రోజూ రాత్రిపూట ముఖానికి రాసుకొని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై మొటిమల తాలుకు మచ్చలు పోయి చర్మం నిగారింపును పొందుతుంది.
- అరకప్పు ముల్తానీ మట్టి, కోడిగుడ్డు తెల్లసొన, ఒక చెంచా ఓట్స్, రెండు చెంచాల టొమాటో గుజ్జును ఒక గిన్నెలో వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి పూసుకుని పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ముఖానికి బాదం నూనె రాసుకుంటే ముఖం నిగ నిగలాడుతుంది.
- ముల్తానీ మట్టిలో చెంచా బాదం నూనె, చెంచా తేనె, అరచెంచా మీగడ, రోజ్వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకొని పూర్తిగా పొడిబారక ముందే చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.