టీచర్ల మరణాలకు సర్కారుదే బాధ్యత: టీపీటీఎఫ్
ABN , First Publish Date - 2021-05-18T15:45:25+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా రోజూ సంభవిస్తున్న ఉపాధ్యాయుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డిమాండ్ చేసింది. కరోనా వైద్యానికి
![టీచర్ల మరణాలకు సర్కారుదే బాధ్యత: టీపీటీఎఫ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రోజూ సంభవిస్తున్న ఉపాధ్యాయుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డిమాండ్ చేసింది. కరోనా వైద్యానికి అందించే రూ.లక్ష రీయంబర్స్మెంట్ను 5 లక్షలకు పెంచాలని, మరణించిన టీచర్ల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని టీపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రమణ, మైస శ్రీనివాసులు డిమాండ్ చేశారు.