నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్లో శ్రీ చైతన్య ఆలిండియా నం.1
ABN , First Publish Date - 2021-12-23T15:50:33+05:30 IST
దేశ వ్యాప్తంగా జరిగిన నాలెడ్జ్ అసె్సమెంట్..
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా జరిగిన నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్-2021 ఒలింపియాడ్ ఫలితాల్లో శ్రీ చైతన్య అగ్రస్థానంలో స్థానంలో నిలిచింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ర్టీ ఒలింపియాడ్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వారిలో ఒక్క శ్రీ చైతన్య స్కూల్ నుంచే రికార్డు స్థాయిలో 14,761 (47.5 శాతం) మంది విద్యార్థులు రెండవ దశకు అర్హత సాధించినట్టు శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత బీఎస్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా మరే ఇతర విద్యా సంస్థ ఈ స్థాయిలో ఫలితాలు సాధించలేదని చెప్పారు. ఈ ఫలితాల ద్వారా భారతదేశంలోనే శ్రీ చైతన్య నంబర్ 1 అని మరోసారి నిరూపితమైన్నట్టు పేర్కొన్నారు.