సీనియర్లకు ఒకలా.. జూనియర్లకు మరోలానా.. టీచర్ల బదిలీలపై తీవ్ర ఆందోళనలు
ABN , First Publish Date - 2021-12-28T16:58:06+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 317ను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా సీనియారిటీ జాబితాల్లో పొరపాట్లు దొర్లాయని, కౌన్సెలింగ్ను సరిగా చేయడం లేదని, అభ్యంతరాలను..
![సీనియర్లకు ఒకలా.. జూనియర్లకు మరోలానా.. టీచర్ల బదిలీలపై తీవ్ర ఆందోళనలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122811233741/12282021112738n18.jpg)
టీచర్లకు స్థానికత లేకుండా చేశారు.. ఉద్యోగ బదిలీల్లో తీవ్ర అన్యాయం
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన
ఇంటర్ బోర్డు ముందు జేఏసీ నిరసన
28న సచివాలయ ముట్టడి: కమిటీ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 317ను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా సీనియారిటీ జాబితాల్లో పొరపాట్లు దొర్లాయని, కౌన్సెలింగ్ను సరిగా చేయడం లేదని, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఉపాధ్యాయుల కేటాయింపుల్లో సీనియారిటీ జాబితాలో జరిగిన తప్పులను సవరించాలని కామారెడ్డి కలెక్టరేట్ వద్ద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ధర్నా చేశారు.