PRC బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-12-08T15:03:28+05:30 IST
పీఆర్సీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య డిమాండ్..
![PRC బకాయిలు తక్షణమే విడుదల చేయాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య
హైదరాబాద్/బర్కత్పుర, డిసెంబర్ 7(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శర్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2018 జూలై 1 తర్వాత రిటెరైన పెన్షనర్లకు కొత్త పెన్షన్, పీఆర్సీని అమలు చేయాలని ఈ సందర్భంగా కె.లక్ష్మయ్య కోరారు.