‘నీట్’లో నామక్కల్ విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు
ABN , First Publish Date - 2021-11-03T15:24:43+05:30 IST
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశం పొందటానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షలో నామక్కల్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకులతో ఉత్తీర్ణులయ్యారు. నీట్
చెన్నై(Chennai): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశం పొందటానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షలో నామక్కల్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకులతో ఉత్తీర్ణులయ్యారు. నీట్ పరీక్షా ఫలితాలు సోమవారం రాత్రి వెలువడ్డాయి. ఈ ఫలితాలను అభ్యర్థుల ఈమెయిల్కు పంపారు. ఆ మేరకు నామక్కల్కు చెందిన ఎం. ప్రవీణ్, నామక్కల్ సమీపం తుమ్మంకురిచ్చికి చెందిన ఎస్ఏ గీతాంజలి మొత్తం 720 మార్కులుగాను 710 మార్కులతో ఉత్తీర్ణులై రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సంపాదించుకున్నారు. గీతాంజలి అఖిల భారత స్థాయిలో 23వ ర్యాంకు, ప్రవీణ్ 30వ ర్యాంకు పొందారు. ఇదేవిధంగా సేలంకు చెందిన విద్యార్థిని అర్జిత 705 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సంపాదించుకుంది.