విలీనమైనా.. విద్యార్థులు అక్కడే!

ABN , First Publish Date - 2021-12-15T15:16:50+05:30 IST

ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్న త పాఠశాలల్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలులో..

విలీనమైనా.. విద్యార్థులు అక్కడే!

ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్‌


అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్న త పాఠశాలల్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలులో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యం లో ప్రభుత్వం తాత్కాలిక చర్యలు చేపట్టింది. తాజాగా మంగళవారం అర్ధరాత్రి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు సమీపం లోని ఉన్నత పాఠశాలల్లో విలీనమైనప్పుడు.. ఆయా ఉన్నత పాఠశాలల్లో కొత్తగా వచ్చిన విద్యార్థుల కు గదులు లేకుంటే ఎప్పటిలానే ప్రాథమిక పాఠశా లలోనే కొనసాగించాలి. అక్కడే పాఠాలు చెప్పాలి. మరోవైపు ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు వచ్చేశాక.. మిగిలిన 1, 2 తరగతుల్లోని విద్యార్థులకు 1:30 నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2021-12-15T15:16:50+05:30 IST