ఇంటర్ విద్యార్థులకు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి
ABN , First Publish Date - 2021-03-21T17:47:20+05:30 IST
ఇంటర్మీడియెట్ ఫస్టియర్ విద్యార్థులకు..

24న ‘ఎథిక్స్’, 27న ‘ఎన్విరాన్మెంటల్’ పరీక్షలు
అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్ ఫస్టియర్ విద్యార్థులకు ఈ నెల 24న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ ఎగ్జామ్, 27న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా విద్యార్థుల నామినల్ రోల్స్ను ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి కాలేజీల ప్రిన్సిపాళ్లు లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ రెండు పరీక్షల్లో విద్యార్థులు క్వాలిఫై కావడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. ఏ విద్యార్థులైతే ఈ రెండు పరీక్షల్లో క్వాలిఫై కాలేదో వారికి ఉన్నత విద్యలో ప్రవేశించేందుకు పాస్ సర్టిఫికెట్ జారీచేయబోమని స్పష్టం చేశారు.