కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు పొడిగింపు
ABN , First Publish Date - 2021-10-21T15:33:56+05:30 IST
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు..

అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని 2022 మార్చి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పొడిగించినందుకు సీఎం జగన్కు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.