PTD సమస్యలపై చర్చించండి: ఈయూ

ABN , First Publish Date - 2021-10-29T14:40:07+05:30 IST

ఉద్యోగులకు వర్తింపజేసే నిబంధనలు..

PTD సమస్యలపై చర్చించండి: ఈయూ

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు వర్తింపజేసే నిబంధనలు, ఇతర ప్రయోజనాలు పీటీడీ సిబ్బందికి అమలు చేయడం లేదని ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించాలని అమరావతి ఏపీ జేఏసీ నాయకులకు ఈయూ రాష్ట్ర నేతలు వైవీ రావు, పలిశెట్టి దామోదర్‌రావు విజ్ఞప్తి చేశారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో కారుణ్యనియామకాలు, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ నిలుపుదల చేయడం, పీటీడీ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ నుంచి మినహాయింపు తదితర సమస్యలపై చర్చించాలని జేఏసీ చైర్మన్‌ బొప్పరాజును కోరారు.


Updated Date - 2021-10-29T14:40:07+05:30 IST