Alert: దరఖాస్తు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-11-01T14:49:17+05:30 IST
రాష్ట్రంలోని..
తిరుపతి (విశ్వవిద్యాలయాలు): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్డీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఏపీ రీసెట్-2021 దరఖాస్తు గడువును నవంబరు 7వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ వి.శ్రీకాంత్రెడ్డి ఆదివారం తెలిపారు. తొలుత దరఖాస్తు గడువు అక్టోబరు 31గా విధించామని.. విద్యార్థుల విన్నపం మేరకు నవంబరు 7వరకు గడువును పొడిగించినట్టు వివరించారు. రూ.2 వేలు అపరాధ రుసుముతో నవంబరు 8 నుంచి 12వ తేదీ వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో 13 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు.