విశాఖలో యువకుడు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-07T16:14:06+05:30 IST
విశాఖలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
విశాఖ: నగరంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నేవీలో ఎంపిక కాలేదని మనస్థాపం చెంది నాల్గవ అంతస్థు పైనుంచి దూకీ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీహరిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డిల్లీకి చెందిన వ్తెభవ్ సింగ్(18), నేవీలో టెక్నికల్ ఎంట్రీ సర్వీస్ ఇంటర్వ్యూకు వచ్చాడు. అయితే ఎంపిక కాకపోవడంతో శ్రీహరిపురంలోని తన పెదనాన్న వుంటున్న అపార్టుమెంట్ నాల్గవ అంతస్ధు పైనుంచి దూకాడు. పోలీసులు మృతదేహాన్ని పొస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.