మల్కాజిగిరిలో యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2021-03-04T11:51:37+05:30 IST
యువతి అదృశ్యమై ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్/ఆనంద్బాగ్ : యువతి అదృశ్యమై ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మల్కాజిగిరి భవానీనగర్కు చెందిన సాల్ల సుమిత మార్చి 1న పనిమీద బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెకోసం వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి సాల్ల మేఘనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.