దంపతుల మధ్య గొడవ.. భార్య ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-19T13:45:22+05:30 IST
భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురైన
హైదరాబాద్/రాజేంద్రనగర్ : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ తేజస్వినికాలనీ మల్లయ్య టవర్స్ ఎదుట గల కాలనీలో అకుల్ అగర్వాల్, సావన్ అగర్వాల్ నివాసం ఉంటారు. వారికి 2007లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు రోజుల క్రితం భార్యాభర్తలిద్దరికీ గొడవ జరిగింది. సావన్ అగర్వాల్ ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని ఉరేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అకుల్ అగర్వాల్ కిటికి అద్దాలు పగులగొట్టి లోపలికి చూడగా భార్య ఉరేసుకుని కనిపించింది. కిటికి అద్దాలు పగులగొట్టే సమయంలో అకుల్ అగర్వాల్కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయనను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సావన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు తన కూతురి మరణంపై అనుమానాలున్నాయని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని రాజేంద్రనగర్ ఏఎస్ఐ ప్రకాశ్ను వివరణ కోరగాఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు.