కాలువలో పడిన ట్రాక్టర్: ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-08-29T00:36:01+05:30 IST
జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. తాడికొండ
గుంటూరు: జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. తాడికొండ మండలం బండారుపల్లి దగ్గర పంట కాలువలో ట్రాక్టర్ పడింది. బాణావత్ బాలు, ఆంగోతు బొగ్గులు లనే ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. మృతి చెందిన వారిని తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.