తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-08T01:03:22+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్
గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఆరీఫ్ తెలిపారు. ఏ1 నిందితుడు కృష్ణ కిశోర్, ఏ2 నిందితుడు షేక్ హబీబ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. జూన్ 19న తాడేపల్లి అత్యాచారం ఘటన జరిగిందని ఆయన వివరించారు. కాబోయే భర్తను కట్టేసి యువతిని ఇద్దరు నిందితులు రేప్ చేసారు. నిందితుడిని విజయవాడ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశామని ఎస్పీ ఆరీఫ్ తెలిపారు. అత్యాచారానికి ముందు ఒక వ్యక్తిని నిందితులు హత్య చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాగి తీగలను చోరీ చేస్తుండగా చూశాడని పల్లీలు అమ్మే వ్యక్తిని దారుణంగా చంపారని ఆయన తెలిపారు. అనంతరం నదీ తీరంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్పీ ఆరీఫ్ తెలిపారు.