శ్రీలంకకు తరలిస్తున్న 96 కిలోల గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2021-11-06T15:11:56+05:30 IST
నాగపట్టినం జిల్లా వేదారణ్యం వద్ద నాటుపడవలో శ్రీలంకకు తరలిస్తున్న 96 కేజీల గంజాయిని పోలీసు లు స్వాధీనం చేసుకుని ఓ యువకుడిని అరెస్టు చేశారు. వేదారణ్యం సమీపం పుష్పవనం జాలర్ల కాలనీలో గంజాయి స్మగ్లింగ్
చెన్నై(Chennai): నాగపట్టినం జిల్లా వేదారణ్యం వద్ద నాటుపడవలో శ్రీలంకకు తరలిస్తున్న 96 కేజీల గంజాయిని పోలీసు లు స్వాధీనం చేసుకుని ఓ యువకుడిని అరెస్టు చేశారు. వేదారణ్యం సమీపం పుష్పవనం జాలర్ల కాలనీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో సముద్రతీర భద్రతా దళం గురువారం సాయంత్రం ఆ ప్రాంతంలో నిఘా వేశారు. ఆ సమయంలో సముద్రతీరంలో నాటు పడవలోని వలలో మూడు బస్తాలుండడం, అందులో ఓ యువకుడు సంచరి స్తుండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులు ఆ పడవలోని బస్తాలను చూడగా అందులో 96 కేజీల గంజాయి లభించింది. దానిని తరలించేందుకు ప్రయత్నించిన మణికంఠన్ (33) అనే యువకుడిని అరెస్టు చేసి నాటు పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. వేదారణ్యం సముద్రతీర భద్రతాదళం కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది.