arrest :బాలికను వివాహమాడిన యువకుడిపై అత్యాచారం కేసు
ABN , First Publish Date - 2021-07-22T14:23:31+05:30 IST
Man Arrested On Rape Charges For Marrying fifteen Year Old Girl In UP పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, పెళ్లాడి కాపురం చేసిన యువకుడిపై పోలీసులు అత్యాచారం కేసు...
బలియా (బీహార్): పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, పెళ్లాడి కాపురం చేసిన యువకుడిపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌ జిల్లాలో వెలుగుచూసింది. మౌ జిల్లా ఇబ్రహీంపట్టి నహర్ క్రాసింగ్ నివాసి అయిన 23 ఏళ్ల యువకుడు 15 ఏళ్ల మైనర్ బాలికను మూడేళ్ల క్రితం కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మైనర్ బాలికను వివాహం చేసుకొని, మూడేళ్లుగా కాపురం చేస్తున్న యువకుడిపై పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు మూడేళ్ల తర్వాత అరెస్టు చేశారు. నిందితుడి ఆస్తిని సీజ్ చేసి, సమాచారం అందజేసిన వ్యక్తికి రూ.25వేల బహుమతి ఇచ్చారు. బాలిక కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకొని మూడేళ్లుగా కాపురం చేసి పిల్లలు పుట్టాక పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడం విశేషం.