కల్తీకల్లు తాగి యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-03-21T09:09:37+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో నాగేశ్వరావు (27), మరికొందరితో కలిసి శుక్రవారం కల్లు తాగారు. తర్వాత అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఆళ్లపల్లి, మార్చి 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో నాగేశ్వరావు (27), మరికొందరితో కలిసి శుక్రవారం కల్లు తాగారు. తర్వాత అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరి కొందరికి కూడా వాంతులు, విరోచనాలు కావడంతో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో శనివారం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు.