విమానాశ్రయంలో రూ.87.50 లక్షల Gold స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-29T13:14:19+05:30 IST
తిరుచ్చి విమానాశ్రయంలో బుధవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిలో దుస్తుల్లో రూ.87.50 లక్షల విలువైన రెండు కి
ప్యారీస్(Chennai): తిరుచ్చి విమానాశ్రయంలో బుధవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిలో దుస్తుల్లో రూ.87.50 లక్షల విలువైన రెండు కిలోల బంగారాన్ని గుర్తించారు. వారు అరియలూరు పళనివేల్, శివగంగ ఆర్ముగం అని విచారణలో తేలడంతో అధికారులు వారిని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు.
నకిలీ పాస్పోర్టుతో...
తిరుచ్చి విమానాశ్రయం నుంచి బుధవారం రాత్రి 10 గంటలకు దుబాయ్ వెళ్లే విమాన ప్రయాణికుల పాస్పోర్టులను ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించారు. అప్పుడు కడలూరు జిల్లా వెప్పూర్ గోపాల్ కుమా రుడు కల్వరాయన్ (32) కళ్లకుర్చి జిల్లా తెన్కీరనూర్ చిరునామాతో నకిలీ పాస్పోర్ట్ పొంది దుబాయ్కు వెళ్తున్నాడని తేలడంతో విమానాశ్రయ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.