బాలికపై యువకుడి యాసిడ్ దాడి..అరెస్ట్

ABN , First Publish Date - 2021-02-22T15:32:47+05:30 IST

తనతో మాట్లాడటం లేదనే కోపంతో ఓ యువకుడు బాలికపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది....

బాలికపై యువకుడి యాసిడ్ దాడి..అరెస్ట్

హాపూర్ (ఉత్తరప్రదేశ్): తనతో మాట్లాడటం లేదనే కోపంతో ఓ యువకుడు బాలికపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది. హాపూర్ కు చెందిన రోహిల్ ఖాన్ స్థానిక ఓ బాలికతో స్నేహం చేశాడు. బాలిక తనతో మాట్లాడటం లేదనే కోపంతో రోహిల్ ఖాన్ యాసిడ్ తీసుకొని ఇంటికి వచ్చి బాలికపై పోసి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన బాలికను మెరుగైన వైద్యం కోసం మీరట్ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడికి గురైన బాలిక ఆసుపత్రిలో కోలుకుంటుందని పోలీసులు చెప్పారు. యాసిడ్ కేసులో నిందితుడైన రోహిల్ ఖాన్ ను సంఘటన జరిగిన ఆరు గంటల్లోనే అరెస్టు చేశామని హాపూర్ పోలీసులు ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-02-22T15:32:47+05:30 IST