ఏసీబీ వలలో అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ
ABN , First Publish Date - 2021-09-14T00:44:33+05:30 IST
లంచం తీసుకుంటుండగా అటవీ శాఖ ఎఫ్ఆర్ఓను ఏసీబీ
చిత్తూరు: లంచం తీసుకుంటుండగా అటవీ శాఖ ఎఫ్ఆర్ఓను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏపీ ముదలియార్ కార్పొరేషన్ చైర్మెన్ బుల్లెట్ సురేష్కు చెందిన స్టోన్ క్రషర్ కంపెనీ అనుమతుల కోసం సురేష్ వద్ద రూ. రెండు లక్షలను ఎఫ్ఆర్వో వేణుగోపాల్ బాబు లంచం డిమాండ్ చేసాడు. విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి బుల్లెట్ సురేష్ తెచ్చారు. లంచం తీసుకుంటుండగా రూ. రెండు లక్షల నగదుతో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నది.