దా‘రుణ’ దందాలో మరో ఐదుగురు చైనీయులు

ABN , First Publish Date - 2021-01-27T09:18:34+05:30 IST

ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల పేరుతో దా‘రుణాల’ వెనుక మరో ఐదుగురు చైనీయులు ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. వీరు ఏడు మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలను నడుపుతున్న ట్లు నిగ్గుతేల్చారు. ఈ కంపెనీల

దా‘రుణ’ దందాలో మరో ఐదుగురు చైనీయులు

కొత్తగా ఏడు కంపెనీల గుర్తింపు


హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల పేరుతో దా‘రుణాల’ వెనుక మరో ఐదుగురు చైనీయులు ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. వీరు ఏడు మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలను నడుపుతున్న ట్లు నిగ్గుతేల్చారు. ఈ కంపెనీల కాల్‌ సెంటర్లు హైదరాబాద్‌తోపాటు.. ఢిల్లీ, గురుగ్రామ్‌, అహ్మదాబాద్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో సైబరాబాద్‌ సైబ ర్‌ క్రైమ్‌ ఆయా ప్రాంతాల్లో మకాం వేసి, నిందితుల కోసం వేటను సాగిస్తున్నా రు. ఇప్పటికే అరెస్టయిన చైనా దేశీయుడు డెన్నీ్‌సను పోలీసు కస్టడీకి తీసుకు ని విచారించడంతో.. మరో ఏడు మైక్రో ఫైనాన్స్‌ కంపెనీల వివరాలు వెలుగుచూశాయి. ఐదుగురు చైనీయులు భారత్‌లో ఉంటూ.. వీటిని నిర్వహిస్తున్నారని, ఆర్థిక లావాదేవీలన్నీ హాంకాంగ్‌ నుంచి జరుగుతున్నాయని సాంకేతిక ఆ ధారాలను సేకరించారు. ఈ ఏడు కంపెనీలకు భారత్‌లోని నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలతో ఎలాంటి ఒప్పందాలు గానీ, భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) అనుమతులు గానీ లేవని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-27T09:18:34+05:30 IST