కొడవలితో గొంతు కోసి.. తలను చీల్చి.. అర్థరాత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లి... ‘సార్.. భార్యను హత్య చేశానంటూ’..
ABN , First Publish Date - 2021-10-10T16:56:45+05:30 IST
ఛత్తీస్గఢ్లో మరో దారుణం చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్లో మరో దారుణం చోటుచేసుకుంది. బిలాస్పూర్ కు చెందిన ఒక యువకుడు కొడవలితో తన భార్యను హతమార్చాడు. తరువాత స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తాను తన భార్యను హత్య చేశానని, ఇంటిలో మృతదేహం పడివుందని పోలీసులుకు తెలిపి, వారికి లొంగిపోయాడు. భార్య... కుమార్తెను కొట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ విచిత్రమైన విషయమేమంటే నిందితునికి, అతను హత్య చేసిన మహిళకు వివాహం జరగలేదు. వారిద్దరూ రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఈ ఉదంతం తోరవా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహమంద్-లాల్ఖదాన్ నివాసి రాజేంద్ర నిర్మల్కర్(40) రెండేళ్లుగా పూర్ణియా పాసీ(35) అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఐదు నెలల కుమార్తె ఉంది. రెండు రోజుల క్రితం ఏదోవిషయమై కుమార్తెను పూర్ణియా కొట్టింది. దీనిని చూసిన రాజేంద్ర ఆమెపై చేయిచేసుకున్నాడు. తరువాత ఆగ్రహంతో ఊగిపోతూ ఒక కొడవలి తెచ్చి భార్య గొంతుకోశాడు. తరువాత ఆమె తలపై కొడవలితో గాయపరిచాడు. ఘటనాస్థలంలోనే పూర్ణియా మృతి చెందింది. వెంటనే రాజేంద్ర... పోలీస్ స్టేషన్కు వెళ్లి.. తాను భార్యను హత్యచేసినట్లు చెప్పి లొంగిపోయాడు.
వెంటనే పోలీసులు అతని ఇంటికి చేరుకుని, పూర్ణియా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంనకు తరలించారు. రాజేంద్ర, పూర్ణియాల కుమార్తెను బాలికల సంరక్షణ గృహానికి తరలించారు. కాగా రాజేంద్రకు అంతకుముందే వివాహమయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిని విడిచిపెట్టి రాజేంద్ర.. పూర్ణియాతో సహజీవనం ప్రారంభించాడు. కాగా పూర్ణయా కూడా భర్తకు దూరమై, రాజేంద్రకు దగ్గరయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.