పెళ్లి కోసం యువతి ప్లాన్.. డౌట్ రాకుండా ఓ కిడ్నాప్.. చివరికి..

ABN , First Publish Date - 2021-03-07T01:29:20+05:30 IST

బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు అతడితో పాటూ ఇంటి నుంచి పరారైంది. తాము పారిపోయిన జంట అని ఎవరికీ అనుమానం రాకుండా ఓ కిడ్నాప్‌ కూడా చేసింది. వ్యూహం బెడిసికొట్టడంతో

పెళ్లి కోసం యువతి ప్లాన్.. డౌట్ రాకుండా ఓ కిడ్నాప్.. చివరికి..

జలంధర్: బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడేందుకు అతడితో పాటూ ఇంటి నుంచి పరారైంది. తాము పారిపోయిన జంట అని ఎవరికీ అనుమానం రాకుండా ఓ కిడ్నాప్‌ కూడా చేసింది. వ్యూహం బెడిసికొట్టడంతో చివరికి ఆ జంట జైలు పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నిషు ద్వివేదీ(20) మంగళవారం నాడు మూడేళ్ల  బంధువుల కూతురిని(3) కిడ్నాప్ చేసింది. ఆమెను తీసుకుని జలంధర్‌లో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లింది. వేరే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోవాలనేది వారి ప్లాన్. 


ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు హోటళ్లలో నివసించాల్సి ఉంటుంది కాబట్టి తమకు తోడుగా ఆ చిన్నారి ఉంటే ఎవరికీ ఎటువంటి అనుమానం కలగదని నిషూ భావించింది. తమను చూసి అందరూ పెళ్లైన జంట అనుకుని పెద్దగా పట్టించుకోరని భావించింది. అయితే.. బిడ్డ కనబడకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టి ఆ జంటను జలంధర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే..పాపకు హానీ తలపెట్టే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని పోలీసులకు తెలిపిందట. పోలీసులు ఆ జంటపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-03-07T01:29:20+05:30 IST