అర్ధరాత్రి కూతురి గదిలోంచి గుసగుసలు.. మెలకువ వచ్చి అనుమానంగానే వెళ్లి చూసిన తల్లిదండ్రులకు షాకింగ్ సీన్.. ఆ తర్వాత..
ABN , First Publish Date - 2021-10-12T21:33:41+05:30 IST
వారంతా కలిసి రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి ఆ తల్లికి ఎందుకో సడెన్గా మెలకువ వచ్చింది. అపుడు కూతురు గదిలో నుంచి గుసగుసలు వినిపించాయి. ఈ సమయంలో గుసగుసలు ఏంటని అనుమానంగానే భర్తతో వెళ్లి చూసింది.
వారంతా కలిసి రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి ఆ తల్లికి ఎందుకో సడెన్గా మెలకువ వచ్చింది. అపుడు కూతురు గదిలో నుంచి గుసగుసలు వినిపించాయి. ఈ సమయంలో గుసగుసలు ఏంటని అనుమానంగానే భర్తతో వెళ్లి చూసింది. అక్కడ కనిపించిన సీన్ చూసి వారు షాక్కు గురయ్యారు. ఆ తర్వాత జరిగిన దారుణం ఏంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకెళ్లాల్సిందే..
ఉత్తరప్రదేశ్లోని ధుమగంజ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువకుడు తన 20 ఏళ్ల ప్రియురాలిని కలిసేందుకు సోమవారం అర్ధరాత్రి ముండేరా ప్రాంతంలోని భుసవలి వీధిలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారనుకుని ఒంటరిగా ఉన్న ప్రియురాలితో మాట్లాడుతున్నాడు. అపుడే కుటుంబసభ్యులకు మెలకువ వచ్చింది. కూతురి గదిలో నుంచి గుసగుసలు వినిపించడంతో అనుమానంగానే వెళ్లి చూశారు. అక్కడ ఆమె ప్రియుడితో ఉండడం చూసి వారి రక్తం మరిగిపోయింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
కోపంతో ఊగిపోతూ యువతి తండ్రి శివకుమార్, తల్లి ఫూలా, సోదరుడు ప్రభాత్ ఆ యువకుడిని చుట్టు ముట్టారు. కర్రలతో ముగ్గురు కలిసి అతడిపై దాడి చేశారు. అతని తల, ఇతర శరీర భాగాలపై తీవ్రంగా గాయలై రక్తస్రావంతో అక్కడే పడిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.