బిగ్ బజార్లో పనిచేస్తున్న యువతి అదృశ్యం
ABN , First Publish Date - 2021-02-25T15:33:26+05:30 IST
యువతి అదృశ్యమైంది. చంపాపేట రెడ్డికాలనీలో
హైదరాబాద్/సైదాబాద్ : యువతి అదృశ్యమైంది. చంపాపేట రెడ్డికాలనీలో నివాసముండే జి.మమత(21) బిగ్ బజార్లో పనిచేస్తుంది. కుటుంబసభ్యులు ఆమెకు వివాహ సంబంధాలు చూస్తున్నారు. బుధవారం ఉదయం ఆమె ఫోన్ ఇంట్లోనే ఉంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.