అదరగొట్టిన జొమాటో... ఆశ్చర్యపోయిన సీఈఓ...
ABN , First Publish Date - 2021-01-01T20:35:25+05:30 IST
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయంలో జొమాటో ఆర్డర్స్ ఆ సంస్థ సీఈవోకే ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఓ వైపు కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకోవాలనే ఆసక్తి, కరోనా వల్ల జాగ్రత్తగా ఉండాలనే అంశం... ఈ రెంటి నేపధ్యంలో... ఆర్డర్స్ భారీగా పెరిగాయి.
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయంలో జొమాటో ఆర్డర్స్ ఆ సంస్థ సీఈవోకే ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఓ వైపు కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకోవాలనే ఆసక్తి, కరోనా వల్ల జాగ్రత్తగా ఉండాలనే అంశం... ఈ రెంటి నేపధ్యంలో... ఆర్డర్స్ భారీగా పెరిగాయి.
జొమాటో నిమిషానికి 3200 ఆర్డర్స్కు పైగా స్వీకరించింది. ఇప్పటి వరకు ఫుడ్ ఆర్డర్స్ పర్ మినట్ దాదాపు 2500 గా ఉన్నాయి. అది పాకిస్తాన్ వర్సెస్ ఇండియాక్రికెట్ మ్యాచ్ సందర్భంగా. ఇప్పుడు దానిని అధిగమించినట్లు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ట్వీట్ చేశారు.
కరోనా నేపధ్యంలో 2020 లో చాలా నెలల పాటు దాదాపు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో... ఆరంభంలో డెలివరీ యాప్స్కు కొంచెం డిమాండ్ తగ్గింది. మళ్ళీ 2020 రెండో అర్ధ సంవత్సరంలో గాడిన పడింది. గత ఏడాది నిమిషానికి 22 బిర్యానీలు డెలివరీ చేసింది జొమాటో. గత కొద్ది నెలలుగా పిజ్జా ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయి. మే నెలలో 4.5 లక్షల పిజ్జా ఆర్డర్స్ రాగా, నవంబర్ నాటికి 17 లక్షల ఆర్డర్స్కు చేరుకుంది.