ఉద్యోగుల వేతనాలు... వచ్చే ఏడాది భారీగా పెరగనున్నాయా ?
ABN , First Publish Date - 2021-07-25T22:25:52+05:30 IST
కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంన్న నేపధ్యంలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని ఓ నివేదిక పేర్కొంది.
న్యూఢిల్లీ : కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంన్న నేపధ్యంలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని ఓ నివేదిక పేర్కొంది. వృత్తి నిపణుల కొరత కూడా వేతనాల పెంపునకు దోహదం చేయనుందని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత దేశంలో ఉద్యోగుల వేతనాలు ఎనిమిది శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని మైఖేల్ పేజ్ అండ్ అయాన్, పీఎల్సీ సంస్థలు తెలిపాయి. ప్రస్తుత ఏడాదిలో 6-8 శాతం మేర వేతనాలు పెరగనున్నాయని పలు సర్వేలు గతంలో అంచనా వేసిన విషయం తెలిసిందే.
కొన్నేళ్లుగా ఆసియా దేశాల్లో చూసుకుంటే, కేవలం భారత్లో మాత్రమే అధిక వేతన పెంపు అమలవుతున్నట్లు ఈ నివేదిక గుర్తు చేసింది. వచ్చే రెండేళ్లలో కూడా ఈ మాదిరిగానే ఉండవచ్చునని పేర్కొంది. ఈ-కామర్స్, ఫార్మా, ఐటీ, ఫైనాన్షియల్ రంగాల్లో రవేతనాలు మరింత అధికంగా ఉండే అవకాశముందని నివేదిక పేర్కొంది. రిటైల్, ఏరోస్పేస్, హోటల్, హాస్పిటాలిటీ రంగాలు మాత్రం వేతన పెంపులో వెనుకబడి ఉడనున్నట్లు వెల్లడించింది.