క్రిప్టోను నిషేధిస్తారా ?
ABN , First Publish Date - 2021-11-29T21:35:20+05:30 IST
అత్యంత వేగంగా విస్తరిస్తోన్న క్రిప్టో కరెన్సీని భారత్లో నిషేధిస్తారా ? ప్రస్తుతం ఆయా వర్గాలను వేధిస్తోన్న ప్రశ్న ఇది. ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ అత్యంత వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్ ముందు వరుసతో ఉన్న విషయం తెలిసిందే. భారత కరెన్సీ రూపాయితో మార్పిడి చేసే పరిమితిని బలహీనపరచినప్పటికీ... క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అత్యంత వేగంగా వృద్ది సాధిస్తోన్న దేశాల్లో భారత్ మార్కెట్ ముందున్న విషయం తెలిసిందే.
ముంబై : అత్యంత వేగంగా విస్తరిస్తోన్న క్రిప్టో కరెన్సీని భారత్లో నిషేధిస్తారా ? ప్రస్తుతం ఆయా వర్గాలను వేధిస్తోన్న ప్రశ్న ఇది. ప్రపంచంలో క్రిప్టోకరెన్సీ అత్యంత వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్ ముందు వరుసతో ఉన్న విషయం తెలిసిందే. భారత కరెన్సీ రూపాయితో మార్పిడి చేసే పరిమితిని బలహీనపరచినప్పటికీ... క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అత్యంత వేగంగా వృద్ది సాధిస్తోన్న దేశాల్లో భారత్ మార్కెట్ ముందున్న విషయం తెలిసిందే. అధికారిక డిజిటల్ కరెన్సీ దిశగా యోచిస్తోన్న భారత కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని స్పష్టం చేసింది. కాగా... క్రిప్టోను నిషేధించడం కాకుండా, నియంత్రణ వైపు కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం.
ఇక... కరోనా కొత్త వేరియంట్ ఆందోళనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఆర్థికవ్యవస్థలు మళ్లీ గందరగోళంలోకి వెళతాయన్న ఆందోళన ఈ సందర్భంగా రేకెత్తుతోంది. భారత్లో క్రమంగా అన్లాక్ అవుతున్న ట్రేడ్ తిరిగి లాకింగ్ పొదిశగా వెళ్లే ప్రమాదంలో ఉందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. గత 45 రోజులుగా, అన్లాక్ థీమ్స్లో ఎఫ్పీఐ (ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్)లు పెట్టుబడులు పెంచుతున్నారు. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ ఆందోళనకరంగా మారుతుండడంతో... మళ్ళీ ఆందోళన మొదలైంది. అక్టోబరు 1-నవంబరు 15 మధ్య... రిటైల్, ఎయిర్లైన్స్, హోటల్, ఆటో స్టాక్స్లలో ఎఫ్పీఐలు పెట్టుబడులు పెంచారు. దాదాపు 1.17 బిలియన్ డాలర్ల(రూ. 8,800 కోట్లు)ను నికరంగా గుమ్మరించారు. అయితే... మొత్తం మార్కెట్పరంగా చూస్తే మాత్రం.. ఇదే కాలంలో, ఇండియన్ ఈక్విటీల్లో 2.1 బిలియన్ డాలర్ల(రూ. 15,850 కోట్లు)తో నెట్ సెల్లర్స్గా ఉన్నారు.
ఈ 45 రోజుల్లో, 'అన్లాక్' ట్రేడ్తో లింక్ అయిన కంపెనీల ఏయూఎం 10% పెరిగి, 60.2 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎఫ్పీఐల మొత్తం ఈక్విటీ పోర్ట్ఫోలియో విలువ మూడు శాతం మేర పెరిగింది. ఇక ఆదాయం కూడా... కొవిడ్ స్ఘాయిలకు చేరుకోవడంతో, కన్జ్యూమర్ ఫోకస్డ్ స్టాక్ల్లో బెట్స్ను ఎఫ్పీఐలు పెంచారు. ఈ నెల మొదటి పదిహేను రోజుల్లో, రిటైల్ స్టాక్స్లోకి 750 మిలియన్ డాలర్లు(రూ. 5,625 కోట్లు) తీసుకొచ్చారు. అన్ని రంగాలతో పోలిస్తే ఇది అత్యధికం. ఎఫ్పీఐల రిటైల్ స్టాక్స్ ఈక్విటీ ఏయూఎం ఈ నెల 15 న 13.89 బిలియన్ డాలర్లకు చేరింది, గత మూడు నెలల్లో 33 % వృద్ధి చెందింది. ఈ నెల మధ్య నాటికి ఎఫ్పీఐ పోర్ట్ఫోలియోలో రిటైల్ వెయిటేజీ 2.02 శాతానికి పెరిగింది. ఇది మల్టీ-ఇయర్ హై లెవెల్. గత త్రైమాసికంలో రిటైల్ కంపెనీల కామెంటరీలు, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ప్రోత్సాహకరంగా ఉండి, పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నింపాయి.
ఈ క్రమంలోనే... ఈ స్టాక్స్పై ఎఫ్పీఐల ఫోకస్ పెరిగింది. ఈ నెల 15 నాటికి, ఏవియేషన్ సెక్టార్ వెయిటేజీ 0.34 శాతానికి, ఎఫ్పీఐల ద్వారా పెరిగింది. దీర్ఘకాలిక సగటు కంటే ఇది 7 బీపీఎష్ అధికం. అక్టోబరు-నవంబరు ట్రాఫిక్లో స్ట్రాంగ్ రికవరీ ఉండడంతో ఈ రంగంలో పెట్టుబడులు పెరిగాయి. మొత్తంమీద క్రిప్టోను నిషేధిస్తారా ? లేక పాక్షిక నియంత్రణ ఉంటుందా ? అన్న అంశాలకు సంబంధించి అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.