మాల్యాకు మళ్లీ చుక్కెదురు

ABN , First Publish Date - 2021-05-19T05:51:35+05:30 IST

విజయ్‌ మాల్యా కు యూకే కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. తమ దివాలా పిటిషన్‌ సవరణ కోసం ఎస్‌బీ ఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకులు పెట్టుకున్న పిటిషన్‌ను లండన్‌ హైకోర్టు అనుమతించింది

మాల్యాకు మళ్లీ చుక్కెదురు

లండన్‌: విజయ్‌ మాల్యాకు యూకే కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. తమ దివాలా పిటిషన్‌ సవరణ కోసం ఎస్‌బీ ఐ నేతృత్వంలోని  భారతీయ బ్యాంకులు పెట్టుకున్న పిటిషన్‌ను లండన్‌ హైకోర్టు అనుమతించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రుణాల కోసం హామీగా పెట్టుకున్న ఆస్తులపై   బ్యాంకులకు ఎలాంటి హక్కు లేదన్న మాల్యా లాయర్ల వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుపై తుది విచారణను జూలై 26కు వాయిదా వేసింది. దీంతో మాల్యా నుంచి రావలసిన రూ.14,000 కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే నెరవేరతాయని భావిస్తున్నారు. మాల్యా నిర్వహణలోని కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం బ్యాంకులు ఈ రుణాలు ఇచ్చాయి. 

Updated Date - 2021-05-19T05:51:35+05:30 IST