టాటా సఫారీ సరికొత్తగా..
ABN , First Publish Date - 2021-01-27T07:38:09+05:30 IST
దేశీయ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. తన ఫ్లాగ్షిప్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ)
ఫిబ్రవరి 4 నుంచి బుకింగ్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. తన ఫ్లాగ్షిప్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) సఫారీని సరికొత్త రూపంలో ఆవిష్కరించింది. కొత్త సఫారీ బుకింగ్స్ వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎస్యూవీ 6, 7 సీట్ల ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 2 లీటర్ డీజిల్ ఇంజన్, సిక్స్ స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో కూడిన ఈ వాహనంలో పనోరమిక్ సన్రూఫ్, రిక్లైనింగ్ సెకండ్ రో సీట్స్, యాంబియెంట్ మూడ్ లైటింగ్, రియర్ ఏసీ వెంట్స్, మల్టీ డ్రైవ్ మోడ్స్, 6 ఎయిర్ బ్యాగ్లు, వంటి ఫీచర్లను చేర్చినట్లు కంపెనీ పేర్కొంది.