Stock Market: ఫ్లాట్గా ముగిసిన సూచీలు!
ABN , First Publish Date - 2021-06-01T21:50:00+05:30 IST
దేశీయ స్టాక్మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) ఫ్లాట్గా ముగిశాయి.
దేశీయ స్టాక్మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) ఫ్లాట్గా ముగిశాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. వరుస లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఒక దేశలో 100 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ చివరలో కోలుకుంది. కేవలం 2 పాయింట్ల నష్టంతో బయటపడింది. 52,067 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన సెన్సెక్స్ చివరకు 2 పాయింట్లు నష్టపోయి 51,934 వద్ద ముగిసింది.
మరోవైపు నిఫ్టీ ర్యాలీకి కూడా బ్రేక్ పడింది. 15,629 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ చివరకు 8 పాయింట్లు కోల్పోయి 15, 574 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లాభాలను ఆర్జించాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిమ్ నష్టాలను చవిచూశాయి.