స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!
ABN , First Publish Date - 2021-05-06T15:41:10+05:30 IST
ప్రధాన రంగ సూచీలు లాభాలను ఆర్జిస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం)ను సానుకూలంగా ప్రారంభించాయి
ప్రధాన రంగ సూచీలు లాభాలను ఆర్జిస్తుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం)ను సానుకూలంగా ప్రారంభించాయి. 48,877 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటల సమయానికి 105 పాయింట్లు లాభపడింది. ఇక, 4,668 వద్ద రోజును ప్రారంభించిన ఉదయం 10 గంటల సమయానికి 50 పాయింట్లు ఎగబాకింది.
టాటా స్టీల్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎయిచర్ మోటార్స్ లాభాలను ఆర్జించాయి. భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టాలను చవిచూస్తున్నాయి.