మళ్లీ 51,000పైన సెన్సెక్స్
ABN , First Publish Date - 2021-03-04T06:13:12+05:30 IST
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ దూసుకు పోయింది. కొనుగోళ్ల మద్దతుతో 1,147.76 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 51,444.65 వద్ద, 326.50 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,245.60 వద్ద ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ దూసుకు పోయింది. కొనుగోళ్ల మద్దతుతో 1,147.76 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 51,444.65 వద్ద, 326.50 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,245.60 వద్ద ముగిశాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 2,344.66 పాయింట్లు, నిఫ్టీ 716.45 పాయింట్ల లాభాలు నమోదు చేశాయి. దీంతో బీఎ్సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) గత మూడు రోజుల్లోనే 9.41 లక్షల కోట్లు పెరిగి రూ.210.22 లక్షల కోట్లకు చేరింది.
మరింత తగ్గిన బంగారం ధర: దేశీయ విపణిలో బంగారం ధర రూ.45 వేల దిగువకు వచ్చింది. బుధవారం న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.208 తగ్గి రూ.44,976 పలికింది.