ఎస్బీఐ... వావ్...
ABN , First Publish Date - 2021-05-22T01:27:26+05:30 IST
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నాలుగవ త్రైమాసికంలో... మంచి ఫలితాలను సాధించింది.

ముంబై : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నాలుగవ త్రైమాసికంలో... మంచి ఫలితాలను సాధించింది. ప్రొవిజన్ల సాయంతో రూ. 6450.75కోట్ల నికరలాభాన్ని ప్రకటించగా, గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఇది 80.14శాతం ఎక్కువ. గతేడాది ఈ లాభం రూ. 3580.8 కోట్లు. ఈ క్రమంలో... ప్రతీ వాటాదారుని ఎస్బీఐ షేరుకు రూ. 4 చొప్పున డివిడెండ్ను ప్రకటించింది. ఎస్బీఐ ఫలితాల ప్రకటన అనంతరం... మార్కెట్లలో ర్యాలీ ఈ రోజు మరింతగా పెరగడం గమనార్హం.